వారంలో ఒకసారి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేయాలి
తహసిల్దార్, ఎంపీడీవోలు వారంలో ఒకరోజు ప్రభుత్వ పాఠశాలను, సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ. 67 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం చేసిన మంత్రి విద్యార్థులకు షూస్ తోపాటు బ్యాగులను అందజేశారు.