BREAKING
సెప్టెంబర్ 2027 నాటికి నూటికి నూరు శాతం అక్షరాస్యతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక ఘనంగా సూర్య అధినేత జన్మదిన వేడుకలు గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకుందాం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలపై ప్రత్యేక కమిటీ టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ విడుదల ప్రభుత్వ భూమి వినియోగంపై వివాదం మెడికల్ హిస్టరీలో అరుదైన రికార్డు.. కిడ్నీలు లేకుండా 271 రోజులు జీవితం హనుమాన్ అంశ్‌ గ్లోబల్ రిలీజ్: అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించనున్న హోంబలే ఫిలిమ్స్ ఆధ్యాత్మిక దృశ్యకావ్యం కట్టంగూర్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ది మేజిక్ ఫరవే ట్రీ మీర్జాపూర్: ది మూవీ కరీంనగర్‌లో విశ్వ బేకరీలో అగ్ని ప్రమాదం రూపొందిన సరికొత్త రికార్డు: జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా నింగిలోకి ఇస్రో 'ఈవోఎస్-05' ఉపగ్రహం కరీంనగర్‌లో 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలపై ప్రత్యేక కమిటీ

Select Suryaa Now
ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలపై ప్రత్యేక కమిటీ

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా హక్కు చట్టం (RTE Act) నిబంధనల ప్రకారం ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాల్సిన 25 శాతం ఉచిత ప్రవేశాల అమలు తీరును మెరుగుపరిచేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రస్తుత మార్గదర్శకాలను పూర్తిగా సవరించి, పారదర్శక విధానాన్ని తీసుకొచ్చేందుకు 16 మంది సభ్యులతో ఒక ఉన్నత స్థాయి రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.  పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఛైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీలో సమగ్ర శిక్షా ఎస్పీడీ కన్వీనర్‌గా కొనసాగనున్నారు. అలాగే విద్యాశాఖకు చెందిన వివిధ విభాగాల డైరెక్టర్లు, లీగల్ అడ్వైజర్లు, ఎన్జీవో ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల సంఘాల ప్రతినిధులతో పాటు ఈ చట్టం కింద ప్రవేశాలు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఈ కమిటీలో చోటు కల్పించారు. సుప్రీంకోర్టు తీర్పులు మరియు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక అందించనుంది.