BREAKING
ప్రభుత్వ భూమి వినియోగంపై వివాదం మెడికల్ హిస్టరీలో అరుదైన రికార్డు.. కిడ్నీలు లేకుండా 271 రోజులు జీవితం హనుమాన్ అంశ్‌ గ్లోబల్ రిలీజ్: అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించనున్న హోంబలే ఫిలిమ్స్ ఆధ్యాత్మిక దృశ్యకావ్యం కట్టంగూర్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ది మేజిక్ ఫరవే ట్రీ మీర్జాపూర్: ది మూవీ కరీంనగర్‌లో విశ్వ బేకరీలో అగ్ని ప్రమాదం రూపొందిన సరికొత్త రికార్డు: జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా నింగిలోకి ఇస్రో 'ఈవోఎస్-05' ఉపగ్రహం కరీంనగర్‌లో 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు రెయిన్ బో పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు విజయం కంటే వైఫల్యమే ఎక్కువ నేర్పిస్తుంది రూపాయి సరికొత్త రికవరీ: డాలర్‌తో మారకపు విలువ రూ.94.48కి చేరిక చెన్నైలో అట్టహాసంగా 'ఒలింపిక్ సిటీ'.. తమిళనాడు సర్కార్ సంచలన ప్రకటన! కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన అద్భుత పాలనగా ప్రజల గుర్తింపు.

కట్టంగూర్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

Select Suryaa Now
  కట్టంగూర్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి


 

 



తెలంగాణ బ్యూరో ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఆధునిక స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు మరింత పారదర్శకంగా, సులభంగా అందే అవకాశం కలుగుతుందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.