రెయిన్ బో పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
బొంరాస్పేట్: మండల కేంద్రంలోని రెయిన్బో పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ర్యాలీ నిర్వహించి ఆకట్టుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.విద్యార్థులకు శ్రీకృష్ణాష్టమి పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం నిర్వహించిన ఉట్టికొట్టే కార్యక్రమం విద్యార్థులు, తల్లిదండ్రులను అలరించింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను సందడిగా మార్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పి. రాఘవేందర్ యాదవ్, ఉపాధ్యాయులు హైమద్, అన్వర్, జనార్ధన్, పార్వతి, శ్వేత, స్వరూప, కవిత, అపర్ణ, నవనీత, శ్రీలత, సాగరిక, సన, రేణుకతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.