కరీంనగర్లో విశ్వ బేకరీలో అగ్ని ప్రమాదం
కరీంనగర్ జ్యోతినగర్లోని జాగిత్యాల రోడ్డుపై ఉన్న విశ్వ బేకరీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అదే ప్రాంతంలోని మూసివేసిన ఓ హాస్టల్లో పాత పేపర్లు, పుస్తకాలు కూడా మంటలకు ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదాల్లో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.ట్రాన్స్ఫార్మర్ వైర్ను కట్ చేయడం వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.