BREAKING
తెలంగాణలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ: జిల్లాల వారీగా కొత్త నోటిఫికేషన్ల వెలువరింపు ఆదిలాబాద్, మామ్నూర్ విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం గంజాయి రహిత జిల్లా లక్ష్యంగా పటిష్ట చర్యలు. సుమారు 3 కోట్ల విలువైన 600 కేజీల భారీ గంజాయి పట్టివేత. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్. అధికారులకు, సిబ్బందికి రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. కమల్ హాసన్, ఎస్.యు. అరుణ్ కుమార్ క్రేజీ ప్రాజెక్ట్: వైరల్‌గా మారిన లుక్ టెస్ట్ గ్లింప్స్ తెలంగాణ టూరిజానికి భారీ బూస్ట్.. రూ.22,324 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: మంత్రి కందుల ఖైరతాబాద్ బడా గణేష్ 2026: 69 అడుగుల ఎత్తులో అభయమివ్వనున్న 'పంచముఖ సంకటహర మహా గణపతి'! ‘రుద్రవీణ’ స్ఫూర్తితో ‘బాలు’ పాత్రను తీర్చిదిద్దుకున్నా: నటుడు అక్షయ్ లగుసాని రేషన్ సరుకుల పంపిణీ గడువు సెప్టెంబర్ 5 వరకు పొడిగింపు 'ప్రేమనే ఊరిలో' చిత్రం నుంచి ‘ఏరై పారే హృదయం’ మెలోడీ సాంగ్ విడుదల! అంబేద్కర్‌పై అవహేళనకు పాల్పడితే సహించం. డీబీపీ జాతీయ అధ్యక్షుడు కృష్ణస్వరూప్ పైలట్ సీటు నుంచి సిల్వర్ స్క్రీన్‌పైకి: నటిగా అరంగేట్రం చేస్తున్న ప్రార్థనా చాబ్రియా ఓబీసీ కాలమ్‌ లేకుండా జనగణన చేస్తే బీసీలకు దక్కేదేమిటి? కేంద్రం వైఖరిపై గుజ్జ సత్యం ఫైర్ దాసరి నారాయణరావు మార్గంలోనే మా ప్రయాణం: నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు 'రంభ ఊర్వశి మేనక' సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం: హీరో అల్లరి నరేష్

ఆదిలాబాద్, మామ్నూర్ విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

Select Suryaa Now
ఆదిలాబాద్, మామ్నూర్ విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

తెలంగాణలో విమానానాయ రంగం విస్తరణ వేగవంతమవుతోంది. రాష్ట్రంలోని ప్రాంతీయ అనుసంధానతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన ఆదిలాబాద్ మరియు వరంగల్ మామ్నూర్ విమానాశ్రయాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  న్యూఢిల్లీలో పర్యటించిన సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. మామ్నూర్ విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ నాటికి శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో సేవలు, ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్) సౌకర్యాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రన్‌వే స్పెక్సిఫికేషన్లపై రక్షణ మరియు పౌర విమానయాన శాఖల మధ్య సంయుక్త సమావేశం నిర్వహించాలని కోరడంతో ఈ ప్రాజెక్టులపై వేగం పెరిగింది. త్వరలోనే రాష్ట్రంలో విమానాశ్రయాల నిర్మాణం ఊపందుకునే అవకాశం ఉంది.