కరీంగూడాలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట
కరీంగూడాలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట
తూప్రాన్ ; తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని కరీం గూడా చౌరస్తాలో వడ్డెర కాలనీలో దాతల సహకారంతో గుడి నిర్మించి, బొడ్రాయి, నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 9వ వార్డు కౌన్సిలర్ ఐలేష్ యాదవ్ ఆధ్వర్యంలో, పుర ప్రముఖుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ లావణ్య దుర్గారెడ్డి, అంజయ్య యాదవ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అతిథులను శాలువలతో సన్మానించారు. కార్యక్రమం తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, ఆశీస్సులు పొందారు.