మహిళా ప్రధానాంశంతో తెరకెక్కిన ‘హ్యాపీ జర్నీ’ సినిమా రిలీజ్ డేట్ ఖరారు: సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల
సాధారణ కమర్షియల్ హంగులకు దూరంగా, పూర్తిగా మహిళా ప్రాధాన్యత ఉన్న భావోద్వేగాలతో వస్తున్న సరికొత్త చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ఏడుగురు విభిన్న మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను ఓ భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్లనుంది. ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలు పోషిస్తున్నారు.
గుత్తా ప్రొడక్షన్స్ మరియు కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాాలపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ద్వారా అభిరామ్ నాయుడు దర్శకుడిగా టాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. తాజాగా మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది.
విడుదల తేదీ ప్రకటనతో పాటు విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. విమానాశ్రయం బ్యాక్డ్రాప్లో ప్రధాన తారాగణం అంతా సరదాగా కనిపిస్తుండగా, ట్రావెల్ బ్యాగులు, విమానం మోటిఫ్ సినిమా థీమ్ను స్పష్టం చేస్తున్నాయి. “Some Trips Change Plans... Some Change Lives” అనే ఆసక్తికరమైన ట్యాగ్లైన్ ఈ ప్రయాణం పాత్రల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చిందనే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కేవలం విదేశీ లొకేషన్లకే పరిమితం కాకుండా, మానవ సంబంధాలు, భావోద్వేగాలు, ప్రయాణంలో ఏర్పడే కొత్త బంధాల నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్కు అద్భుతమైన స్పందన రావడంతో, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరును మరింత పెంచేందుకు సిద్ధమైంది.