శిశు మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి
సూర్య జగిత్యాల ప్రతినిధి:శిశు మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలని జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి. సుజాత అన్నారు. గురువారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో శిశు మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన శిశు మరణాల కారణాలను విశ్లేషించి, నివారణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ ఎన్. శ్రీనివాస్, డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి, డీఐఓ డాక్టర్ నరేంద్ర పాల్గొన్నారు.