ప్రమోషన్ పై వెళ్లిన పశువైద్యాధికారికి ఘన సన్మానం
ప్రమోషన్ పై వెళ్లిన పశువైద్యాధికారికి ఘన సన్మానం
తూప్రాన్, తూప్రాన్, మనోహరాబాద్ మండలాలలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేసిన డాక్టర్ లక్ష్మి గత పది రోజుల క్రితం పశు వైద్యశాఖ ఏడిగా పదోన్నతి పొందింది. గత వారం సిద్దిపేటలో చార్జ్ కూడా తీసుకుంది. ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ లింగమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆమె మాట్లాడుతూ తూప్రాన్ లో పనిచేయడం చాలా సంతృప్తి నిచ్చిందని, తూప్రాన్ బాధగా ఉన్నప్పటికి, ప్రమోషన్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సిబ్బందికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన సేవలను కొనసాగిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నూతన పశు వైద్యాధికారి డాక్టర్ సుధాకర్, గోపాలమిత్రలు, పశు వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.