BREAKING
'జల్ సంచయ్ జన్ భాగీదారి'కి విశేష స్పందన నేపాల్-టిబెట్ సరిహద్దులో ప్రాణాంతక ఆకస్మిక వరదలు అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పరిగిలో అభివృద్ధి పనులు కనిపించడం లేదా..? సీఎం చంద్రబాబును కలిసిన జర్నలిస్టుల ప్రతినిధులు సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి నేపాల్‌లో ఘోర విపత్తు: ఆకస్మిక వరదలు, కొండచర్యల కారణంగా వెయ్యి దాటిన మరణాలు "పల్లె నిద్ర"లో కలెక్టర్ పి. రాజాబాబు శిశు మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి ప్రభాస్‌ను కలిసిన సుమంత్ ప్రభాస్.. ‘రోమాంచకం’ టీమ్‌కు రెబల్ స్టార్ స్పెషల్ విషెస్! డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రాజ్ తరుణ్ కొత్త సినిమా పోస్టర్ విడుదల ప్రమోషన్ పై వెళ్లిన పశువైద్యాధికారికి ఘన సన్మానం విద్యుత్ ప్లాంట్లను సిద్ధంగా ఉంచి నిరంతర విద్యుత్‌ అందించండి తెలంగాణ మహిళా కమిషన్ కొత్త చైర్‌పర్సన్‌గా నెరెల్ల శారద నియామకం

పరిగిలో అభివృద్ధి పనులు కనిపించడం లేదా..?

Select Suryaa Now
పరిగిలో అభివృద్ధి పనులు కనిపించడం లేదా..?

 బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ నేతల సూటి ప్రశ్న

కుల్కచర్ల: బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్‌ నాయకులు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్‌ టి. రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పీఏసీఎస్‌ చైర్మన్‌ బొలుసాని భీంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బి.ఎస్‌. ఆంజనేయులు ముదిరాజ్ తెలిపారు. మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గోపాల్‌ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
బీఆర్‌ఎస్‌ నేతలు వాస్తవాలను పక్కనపెట్టి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు కనిపిస్తున్న అభివృద్ధిని కళ్లుండి చూడలేకే బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి నాయకత్వంలో పరిగి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులే కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వివిధ గ్రామాల సర్పంచ్లు ఉన్నారు.