BREAKING
అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్.. అందరూ కట్టుబడి ఉండాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాగుంటపై నోరుపారేసుకుంటే సహించేది లేదు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ నిరంతర పోరాటం 'రోమాంచకం' థియేటర్లలో సందడి చేస్తోంది: యూత్ కంటెంట్‌తో నేడు ప్రేక్షకుల ముందుకు! వెలిగొండపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ఆకట్టుకుంటున్న ‘ఏరై పారే హృదయం’ గీతం.. విడుదల చేసిన డా. సీహెచ్. ప్రీతిరెడ్డి! ఘనంగా "జయహో రామానుజ" సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్.. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! నేడు అనుచరులతో కొండా సురేఖ భేటీ.. Toxic Box Office Collection Day 8: మొదటి వారం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయిన యాష్ సినిమా నీటి వివాదం.. యోగీ ప్రభుత్వ వేధింపులకు ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ రాజీనామా? హోండా నుంచి 10 కొత్త టూవీలర్లు: రెబెల్ క్రూయిజర్లు, ADV 160, QC3 ఈవీ స్కూటర్ ఆవిష్కరణ మధ్యమానేరు జలాశయం నుండి కాలువ ద్వారా సాగుకోసం నీటిని విడుదలకై రైతుల రాస్తారోకో. జైలు ఖైదీకి ప్రత్యేక గది.. అధికారిణిపై బదిలీ వేటు, అసలేం జరిగిందంటే? శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ సీఈఓగా జితేంద్ర మిశ్రా నియామకంపై ఎన్.రామచందర్ రావు హర్షం భారత్-బెల్జియం రక్షణ మంత్రుల ద్వైపాక్షిక చర్చలు

మాగుంటపై నోరుపారేసుకుంటే సహించేది లేదు

Select Suryaa Now
మాగుంటపై నోరుపారేసుకుంటే సహించేది లేదు

మాగుంటపై నోరుపారేసుకుంటే సహించేది లేదు

- వైసీపీ నేతల వ్యాఖ్యలపై శ్యామల కాశిరెడ్డి తీవ్ర ఆగ్రహం

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై వైసీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ప్రకాశం జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్యామల కాశిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజా సేవలో మూడు దశాబ్దాలుగా మాగుంట కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందని అలాంటి కుటుంబంపై నోటికొచ్చినట్లు మాట్లాడటం వైసీపీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.

మాగుంట లిక్కర్‌ వ్యాపారం చేస్తున్నారని ఇప్పుడు విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు 2019లో మాగుంటకు తమ పార్టీ తరఫున టికెట్‌ ఇచ్చినప్పుడు ఈ విషయం తెలియదా అని శ్యామల కాశిరెడ్డి ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒకప్పుడు మాగుంటను అక్కున చేర్చుకుని ఇప్పుడు విమర్శలు చేయడం వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.

ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని శ్యామల కాశిరెడ్డి హెచ్చరించారు. మాగుంటపై నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో మాగుంట కుటుంబం చేసిన సేవలను ప్రజలు మరచిపోలేదని స్పష్టం చేశారు.వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మాగుంటను విమర్శించే నైతిక హక్కు లేదని శ్యామల కాశిరెడ్డి అన్నారు. మాగుంటపై విమర్శలు చేసే ముందు చెవిరెడ్డి తన రాజకీయ ప్రస్థానం గత వ్యవహారాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే తగిన స్థాయిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.