BREAKING
మధ్యమానేరు జలాశయం నుండి కాలువ ద్వారా సాగుకోసం నీటిని విడుదలకై రైతుల రాస్తారోకో. జైలు ఖైదీకి ప్రత్యేక గది.. అధికారిణిపై బదిలీ వేటు, అసలేం జరిగిందంటే? శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ సీఈఓగా జితేంద్ర మిశ్రా నియామకంపై ఎన్.రామచందర్ రావు హర్షం భారత్-బెల్జియం రక్షణ మంత్రుల ద్వైపాక్షిక చర్చలు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు గాయపడిన ఎస్ఎఫ్ఐ నేతను పరామర్శించిన పినరయి విజయన్ చెన్నైలో 'ఒలింపిక్ సిటీ', 'మోటార్ స్పోర్ట్స్ సిటీ' HYDRAAకు హైకోర్టులో ఊరట.. కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తొలగింపుపై సింగిల్ జడ్జి ఆదేశాలకు తాత్కాలిక బ్రేక్ వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ స్థిరనివాసులు, సైన్యం దాడి గంభీర్‌కు నచ్చిన ఆటగాళ్లకు మళ్లీ ఛాన్స్.. టీమ్ ఎంపికపై బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు గుజరాతీ సంగీత దిగ్గజం గౌరంగ్ వ్యాస్ కన్నుమూత: ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం గ్లోబల్ మార్కెట్లలో ఆటో విడిభాగాల పరిశ్రమ విస్తరించాలి సానుకూల ప్రపంచ సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన భారత మార్కెట్లు ప్రజాస్వామ్యానికి 'బూత్ స్థాయి అధికారులు' కీలక స్తంభాలు ఇంధన భద్రత, కార్బన్ మార్కెట్లపై భారత్-జర్మనీ ద్వైపాక్షిక చర్చలు

జైలు ఖైదీకి ప్రత్యేక గది.. అధికారిణిపై బదిలీ వేటు, అసలేం జరిగిందంటే?

Select Suryaa Now
జైలు ఖైదీకి ప్రత్యేక గది.. అధికారిణిపై బదిలీ వేటు, అసలేం జరిగిందంటే?

న్యూస్ డెస్క్: జైలు అధికారిణిపై బదిలీ వేటు.. ఖైదీకి ప్రత్యేక సౌకర్యాల ఆరోపణలతో కీలక నిర్ణయం

కర్ణాటక: మండ్య జిల్లా జైలు సూపరింటెండెంట్ ఎం. శాంతమ్మపై బదిలీ వేటు పడింది. జైలులో ఉన్న ఓ విచారణ ఖైదీకి నిబంధనలకు విరుద్ధంగా సౌకర్యాలు కల్పించారనే ఆరోపణలు రావడంతో ఆమెను బళ్లారి సెంట్రల్ జైలుకు బదిలీ చేస్తూ జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

శ్రీరంగపట్నానికి చెందిన ప్రభుత్వ అధికారి మహమ్మద్ హుస్సేన్ ప్రస్తుతం ఫోర్జరీ కేసులో విచారణ ఖైదీగా ఉన్నారు. అయితే అనారోగ్యానికి సంబంధించిన స్పష్టమైన కారణాలు లేకపోయినా ఆయన మిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పేరుతో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న విషయం బయటకు రావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రిని పరిశీలించడంతో పాటు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.

ఇదే సమయంలో మండ్య జైలులో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఖైదీలు రాసినట్లుగా భావిస్తున్న ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. డబ్బులు చెల్లిస్తే కొందరు ఖైదీలకు ప్రత్యేక సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు అందులో ఉన్నట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా సెషన్స్ జడ్జి నేతృత్వంలోని బృందం ఆసుపత్రిని తనిఖీ చేసి సంబంధిత వ్యక్తులను విచారించింది. ఘటనపై ప్రాథమిక పరిశీలనలో జైలు అధికారుల పర్యవేక్షణలో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో జైళ్ల చీఫ్ అలోక్ కుమార్.. మండ్య జైలు సూపరింటెండెంట్ ఎం. శాంతమ్మను బళ్లారి సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఫక్కీరప్ప బరకర్‌ను కొత్తగా నియమించారు.

జైలు నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన నేపథ్యంలో ఈ బదిలీ ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.