ప్రజాస్వామ్యానికి 'బూత్ స్థాయి అధికారులు' కీలక స్తంభాలు
సీఈసీ జ్ఞానేష్ కుమార్
గోవా: భారత ఎన్నికల సంఘం (ECI) మరియు దేశ పౌరుల మధ్య 'బూత్ స్థాయి అధికారులు' (BLOs) తొలి సంప్రదింపు వేదికగా వ్యవహరిస్తారని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు వారే కీలకమైన స్తంభాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. గోవాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన 1,000 మందికి పైగా బీఎల్ఓలతో ఆయన ముఖాముఖి సమావేశమయ్యారు.
భారతదేశంలో ఓటర్ల జాబితాల తయారీ మరియు ఎన్నికల నిర్వహణ ప్రక్రియలన్నీ రాజ్యాంగం, చట్టాలు మరియు ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత కచ్చితత్వంతో జరుగుతాయని తెలిపారు.ఓటర్ల జాబితాల రూపకల్పనలో గోవా బీఎల్ఓలు పోషిస్తున్న ప్రతిష్టాత్మక పాత్రను, జాబితాల విశ్వసనీయతను కాపాడుతున్న తీరును సీఈసీ కొనియాడారు.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు నియమించే బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs), పోలింగ్ మరియు లెక్కింపు ఏజెంట్ల నిరంతర పర్యవేక్షణలోనే ఓటర్ల జాబితాలు, మొత్తం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వివరించారు.
కార్యక్రమంలో భాగంలో బీఎల్ఓల బాధ్యతలను వివరిస్తూ కొంకణి భాషలో, అలాగే బీఎల్ఏ (BLA)ల పాత్రపై ఆంగ్లంలో రూపొందించిన చిన్న అవగాహన వీడియోలను విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన ప్రశ్న-జవాబుల కార్యక్రమంలో బీఎల్ఓలు నేరుగా సీఈసీని కలిసి తమ విధులపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు.