BREAKING
చెన్నైలో 'ఒలింపిక్ సిటీ', 'మోటార్ స్పోర్ట్స్ సిటీ' HYDRAAకు హైకోర్టులో ఊరట.. కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తొలగింపుపై సింగిల్ జడ్జి ఆదేశాలకు తాత్కాలిక బ్రేక్ వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ స్థిరనివాసులు, సైన్యం దాడి గంభీర్‌కు నచ్చిన ఆటగాళ్లకు మళ్లీ ఛాన్స్.. టీమ్ ఎంపికపై బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు గుజరాతీ సంగీత దిగ్గజం గౌరంగ్ వ్యాస్ కన్నుమూత: ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం గ్లోబల్ మార్కెట్లలో ఆటో విడిభాగాల పరిశ్రమ విస్తరించాలి సానుకూల ప్రపంచ సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన భారత మార్కెట్లు ప్రజాస్వామ్యానికి 'బూత్ స్థాయి అధికారులు' కీలక స్తంభాలు ఇంధన భద్రత, కార్బన్ మార్కెట్లపై భారత్-జర్మనీ ద్వైపాక్షిక చర్చలు మయన్మార్‌లో శాంతి, స్థిరత్వానికి భారత్ కట్టుబడి ఉంది పోలవరం క్రెడిట్‌పై చంద్రబాబుపై జగన్‌ ఫైర్‌.. ప్రాజెక్టు ఎత్తుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ భారత్-సెయిషెల్స్ సంబంధాలు శతాబ్దాల నాటి నాగరిక బంధాలలో పాతుకుపోయాయి మహిళా ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు భారత్‌కు కాపీరైట్ కంటెంట్‌పై AI శిక్షణకు అనుమతి ఇవ్వాలి 7.8% జీడీపీ వృద్ధితో భారత్ అగ్రస్థానం

మయన్మార్‌లో శాంతి, స్థిరత్వానికి భారత్ కట్టుబడి ఉంది

Select Suryaa Now
మయన్మార్‌లో శాంతి, స్థిరత్వానికి భారత్ కట్టుబడి ఉంది

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
న్యూఢిల్లీ: మయన్మార్‌లో శాంతి, స్థిరత్వం మరియు జాతీయ సయోధ్యకు మద్దతు ఇచ్చేందుకు భారతదేశం మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేసుకునే ప్రక్రియలో మయన్మార్‌కు భారత్ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మయన్మార్ పార్లమెంట్ అంతర్జాతీయ సంబంధాల కమిటీ ఛైర్‌పర్సన్ డాక్టర్ ప్వెంట్ సాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భారత పర్యటనకు రాగా, బుధవారం న్యూఢిల్లీలో స్పీకర్ వారికి సాదర స్వాగతం పలికారు. భారత్ నిర్వహించే పార్లమెంటరీ సామర్థ్య నిర్మాణ కార్యక్రమంలో (PRIDE) పాల్గొనేందుకు ఈ బృందం ఇక్కడకు వచ్చింది.

భారత్ అనుసరిస్తున్న 'యాక్ట్ ఈస్ట్', 'నైబర్ హుడ్ ఫస్ట్' మరియు 'ఇండో-పసిఫిక్' విదేశాంగ విధానాల్లో మయన్మార్‌కు అత్యంత కీలకమైన స్థానం ఉందని ఓం బిర్లా పేర్కొన్నారు. ఉమ్మడి బౌద్ధ వారసత్వం, నాగరిక సంబంధాలు ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత దృఢం చేస్తున్నాయన్నారు.

మయన్మార్‌లో డిసెంబర్ 2025 నుండి జనవరి 2026 మధ్య మూడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMలు) మరియు అనుపాత ప్రాతినిధ్య విధానాన్ని ఉపయోగించడాన్ని స్పీకర్ ప్రశంసించారు. ఇది ఆ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయి అని అభివర్ణించారు.

భారత ప్రజాస్వామ్య ప్రస్థానం, 2004 నుండి విస్తృతంగా వాడుకలో ఉన్న EVMలు మరియు VVPAT వ్యవస్థల పారదర్శకతను ఆయన వివరించారు. పార్లమెంటరీ విధానాలు, నియమ నిబంధనలలో భారత్ సాధించిన అనుభవాన్ని మయన్మార్‌తో పంచుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. అపద సమయంలో మయన్మార్‌కు సహాయం అందించే తొలి దేశంగా భారత్ నిలిచిందని, ఈ సామర్థ్య నిర్మాణ శిక్షణ ఇరుదేశాల పార్లమెంటరీ సహకారాన్ని మరింత పెంపొందిస్తుందని స్పీకర్ ఓం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు.