మధ్యమానేరు జలాశయం నుండి కాలువ ద్వారా సాగుకోసం నీటిని విడుదలకై రైతుల రాస్తారోకో.
సూర్య.ఇల్లంతకుంట.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోగల మిడ్ మానేరు జలాశయం నుండి కుడి కాలువ ద్వారా సాగునీటి కోసం నీటిని వదలాలని డిమాండ్ చేస్తూ ఇల్లంతకుంట -కరీంనగర్ వెళ్లే రహదారిలోని వంతడ్పుల బ్రీడ్జీ పై రోడ్డు పై రైతులు బైటాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి వుంటే వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ చూపి సాగునీరాందేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో వల్లంపట్ల, వంతడుపుల, కిష్టారావుపల్లే, గాలిపల్లి, తో పాటు పలు గ్రామాల రైతులున్నారు.