BREAKING
భారత్-సెయిషెల్స్ సంబంధాలు శతాబ్దాల నాటి నాగరిక బంధాలలో పాతుకుపోయాయి మహిళా ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు భారత్‌కు కాపీరైట్ కంటెంట్‌పై AI శిక్షణకు అనుమతి ఇవ్వాలి 7.8% జీడీపీ వృద్ధితో భారత్ అగ్రస్థానం ప్రపంచ సంక్షోభాల వేళ భారత్ 7.8% వృద్ధి అద్భుతం జన్మహక్కు పౌరసత్వంపై ట్రంప్ ఉత్తర్వులకు అడ్డుకట్ట నటుడు ఉత్తమ్ కుమార్ శతజయంతి: ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి చైనా ఏజెంట్‌గా వ్యవహరించిన అమెరికన్ జర్నలిస్టుకు రెండేళ్ల జైలు శిక్ష భారత్‌లో బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ పర్యటన సమాచార శాఖ అదనపు డైరెక్టర్‌ డీఎస్‌ ‌జగన్‌‌కు ఫెడరేషన్‌ సన్మానం ఫెడ్ రేట్ల సంకేతాలపై మార్కెట్ల కన్ను...పుంజుకున్న ఆసియా షేర్లు, బాండ్లు హోర్ముజ్ జలసంధిలో సౌదీ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి సార్వభౌమాధికార రక్షణ ప్రాతిపదికన కేసును కొట్టివేయండి మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ జ్వాలలు తెలుగు రాష్ట్రాలకు వెదర్ అలర్ట్: ఏపీ, తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు!

సమాచార శాఖ అదనపు డైరెక్టర్‌ డీఎస్‌ ‌జగన్‌‌కు ఫెడరేషన్‌ సన్మానం

Select Suryaa Now
సమాచార శాఖ అదనపు డైరెక్టర్‌  డీఎస్‌ ‌జగన్‌‌కు ఫెడరేషన్‌ సన్మానం

సమాచార శాఖ అదనపు
డైరెక్టర్‌  డీఎస్‌ ‌జగన్‌‌కు ఫెడరేషన్‌ సన్మానం

హైదరాబాద్, : సమాచార, పౌరసంబంధాల శాఖ అదనపు డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన డీఎస్‌ ‌జగన్‌‌కు తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(‌టీడబ్ల్యూజేఎఫ్‌) ‌రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలియజేసింది. బుధవారం హైదరాబాద్‌‌లోని సమాచార్‌ ‌భవన్‌‌లో ఫెడరేషన్‌ ‌రాష్ట ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య నాయకత్వంలో ఉపాధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్‌, తాటికొండ కృష్ణ, ‌బి రాజశేఖర్‌, కార్యదర్శి గండ్ర నవీన్‌ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. దీర్ఘకాలికంగా పాత్రికేయుల అభివృద్ధి, సంక్షేమం కోసం జగన్‌ ‌పాటుపడ్డారని చెప్పారు. అక్రిడిటేషన్ల జారీలో మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. పదోన్నతి నేపథ్యంలో మరింత బాధ్యత పెరిగిందనీ, జర్నలిస్టులు, సమాచార శాఖ మధ్య సమన్వయాన్ని పెంచాలని సూచించారు. జిల్లాల్లో అక్రిడిటేషన్ల జారీ విషయంలో డీపీఆర్‌‌వోలు జాప్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా జగన్‌‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. అలాగే జగన్‌‌కు ‘రాజ్యాంగం మనకేమిచ్చింది’ అనే పుస్తకాన్ని ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య బహుకరించారు.