సమాచార శాఖ అదనపు డైరెక్టర్ డీఎస్ జగన్కు ఫెడరేషన్ సన్మానం
సమాచార శాఖ అదనపు
డైరెక్టర్ డీఎస్ జగన్కు ఫెడరేషన్ సన్మానం
హైదరాబాద్, : సమాచార, పౌరసంబంధాల శాఖ అదనపు డైరెక్టర్గా పదోన్నతి పొందిన డీఎస్ జగన్కు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలియజేసింది. బుధవారం హైదరాబాద్లోని సమాచార్ భవన్లో ఫెడరేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య నాయకత్వంలో ఉపాధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్, తాటికొండ కృష్ణ, బి రాజశేఖర్, కార్యదర్శి గండ్ర నవీన్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. దీర్ఘకాలికంగా పాత్రికేయుల అభివృద్ధి, సంక్షేమం కోసం జగన్ పాటుపడ్డారని చెప్పారు. అక్రిడిటేషన్ల జారీలో మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. పదోన్నతి నేపథ్యంలో మరింత బాధ్యత పెరిగిందనీ, జర్నలిస్టులు, సమాచార శాఖ మధ్య సమన్వయాన్ని పెంచాలని సూచించారు. జిల్లాల్లో అక్రిడిటేషన్ల జారీ విషయంలో డీపీఆర్వోలు జాప్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా జగన్కు శాలువా కప్పి సన్మానం చేశారు. అలాగే జగన్కు ‘రాజ్యాంగం మనకేమిచ్చింది’ అనే పుస్తకాన్ని ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య బహుకరించారు.