విద్యార్థి అదృశ్యం
గౌతమి మోడల్ స్కూల్ నుంచి వెళ్లిపోయిన 13 ఏళ్ల విద్యార్థి
యాలాల మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 2): గౌతమి మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న వాసు చౌహన్ (13) అదృశ్యమైన ఘటనపై కేసు నమోదైంది. పెద్దేముల్ మండలం హోమ్లా నాయక్ తండాకు చెందిన వాసు చౌహన్,తండ్రి శ్రీను. బుధవారం ఉదయం 6 గంటల నుంచి బాలుడు పాఠశాల నుంచి వెళ్లిపోయినట్లు పాఠశాల ప్రిన్సిపల్ కొండారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, బాలుడి ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి కోరారు.