BREAKING
రవితేజ ‘ఇరుముడి’కి బాక్సాఫీస్ షేక్.. జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా సెన్సేషన్! సుడిగాలి సుధీర్ ‘GOAT’.. సెప్టెంబర్ 11న థియేటర్లలో యాక్షన్ కామెడీ దుమ్మురేపనున్నాడా? కార్తీ ‘సర్దార్ 2’.. సెప్టెంబర్ 10న థియేటర్లలో స్పై యాక్షన్ ధమాకా! కాంగ్రెస్ పార్టీ హామీల మోసాలపై.. బిఆర్ఎస్ పోరుబాట మ్యాజిక్కా.... మజాకానా పుష్పక విమానాన్ని తలపిస్తున్న టాటా మ్యాజిక్ లు పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 1.11 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్ రోజూ వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ 8 విషయాలు తప్పక తెలుసుకోండి.. ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్స్! అశ్వాపురంలో కారులో తరలిస్తున్న 40 కిలోల గంజాయి పట్టివేత: ఒడిశా దంపతుల అరెస్ట్ వైద్య కళాశాల, జీజీహెచ్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యం. మంత్రి దామోదర్ రాజనర్సింహ రాజేంద్రనగర్ జోన్‌లో.. 'సర్' హియరింగ్ ప్రక్రియ పరిశీలన బండ్లగూడ, హైదర్‌షాకోట్, శివరాంపల్లి కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్హత లేని వైద్యుడితో వైద్యం.. సూర్య హాస్పిటల్‌కు షోకాజ్.. ..మెట్‌పల్లిలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు.. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేసిన మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ విడుదల: ఆకట్టుకుంటున్న యూత్‌ఫుల్ లవ్ స్టోరీ జనసేన యువజన విభాగంగా ‘జై కొట్టు’ ఆవిర్భావం

కాంగ్రెస్ పార్టీ హామీల మోసాలపై.. బిఆర్ఎస్ పోరుబాట

Select Suryaa Now
కాంగ్రెస్ పార్టీ హామీల మోసాలపై..  బిఆర్ఎస్ పోరుబాట

నిరసన ప్రదర్శన చేసిన గులాబీ దళం

హామీలు నెరవేర్చాలని తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

మణుగూరు ఆర్ సి సూర్య(మేజర్ న్యూస్); కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ..మణుగూరు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ...బిఆర్ఎస్ కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు హామీలను నెరవేర్చకుండా కాలం వెళ్ళదీస్తున్నారని ఆరోపించారు.పార్టీ పిలుపు మేరకు బుధవారం నుండి ఈ నెల 8 వ తేదీ వరకు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాలతో గులాబీ శ్రేణులు పోరుబాట పట్టారు.

నియోజకవర్గ పరిధిలోని మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం మండలాల నుండి వచ్చిన గులాబీ దళం భారీ ప్రదర్శన నిర్వహించారు.తహశీల్దార్ కార్యాలయం ఎదుట కొద్దిసేపు ధర్నా నిర్వహించిన అనంతరం రెవిన్యూ అధికారులకు కాంగ్రెస్ హామీ మోసాలపై వినతి పత్రం సమర్పించారు.బిఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు.