కాంగ్రెస్ పార్టీ హామీల మోసాలపై.. బిఆర్ఎస్ పోరుబాట
నిరసన ప్రదర్శన చేసిన గులాబీ దళం
హామీలు నెరవేర్చాలని తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా
మణుగూరు ఆర్ సి సూర్య(మేజర్ న్యూస్); కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ..మణుగూరు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ...బిఆర్ఎస్ కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు హామీలను నెరవేర్చకుండా కాలం వెళ్ళదీస్తున్నారని ఆరోపించారు.పార్టీ పిలుపు మేరకు బుధవారం నుండి ఈ నెల 8 వ తేదీ వరకు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాలతో గులాబీ శ్రేణులు పోరుబాట పట్టారు.
నియోజకవర్గ పరిధిలోని మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం మండలాల నుండి వచ్చిన గులాబీ దళం భారీ ప్రదర్శన నిర్వహించారు.తహశీల్దార్ కార్యాలయం ఎదుట కొద్దిసేపు ధర్నా నిర్వహించిన అనంతరం రెవిన్యూ అధికారులకు కాంగ్రెస్ హామీ మోసాలపై వినతి పత్రం సమర్పించారు.బిఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు.