ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేసిన మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి
ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేసిన మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి
ఆరోగ్యశ్రీ, 108 సేవలతో పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన దార్శనికుడు వైయస్సార్ ఆయన స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ఆరోగ్య బలోపేతం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.
అందోల్ ; ప్రజా సంక్షేమమే పరమావధిగా జీవితాంతం పనిచేసిన మహోన్నత నాయకుడు, దార్శనిక ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ గారు మాట్లాడుతూ... "ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకుని, వారి అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేయడంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు అచంచలమైన నిబద్ధత చూపించారు" అని కొనియాడారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొంది, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్యకు బంగారు బాటలు వేశారని గుర్తు చేశారు.వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, సామాజిక సంక్షేమం వంటి అనేక రంగాల్లో ఆయన చేపట్టిన కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు."ప్రజల సంక్షేమం కోసం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు చూపిన అంకితభావం, ప్రజాసేవా స్ఫూర్తి నేటికీ మనందరికీ మార్గదర్శకం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, పేదలు మరియు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి" అని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.