అర్హత లేని వైద్యుడితో వైద్యం.. సూర్య హాస్పిటల్కు షోకాజ్.. ..మెట్పల్లిలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు..
..
సూర్య మెట్పల్లి:-
అర్హత లేని వైద్యుడు ఈఎన్టీ స్పెషలిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారనే ఫిర్యాదులపై మెట్పల్లిలోని సూర్య హాస్పిటల్లో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. ముస్కు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వైద్యుల విద్యార్హతలు, రిజిస్ట్రేషన్, ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.
ప్రాథమికంగా గుర్తించిన అంశాల ఆధారంగా ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసి, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.అనంతరం పట్టణంలోని ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. అర్హత కలిగిన, నమోదిత వైద్యులతోనే సేవలు అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డా. జైపాల్ రెడ్డి హెచ్చరించారు.