BREAKING
రాజేంద్రనగర్ జోన్‌లో.. 'సర్' హియరింగ్ ప్రక్రియ పరిశీలన బండ్లగూడ, హైదర్‌షాకోట్, శివరాంపల్లి కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్హత లేని వైద్యుడితో వైద్యం.. సూర్య హాస్పిటల్‌కు షోకాజ్.. ..మెట్‌పల్లిలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు.. ‘మా రాముడు అందరివాడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్: సెప్టెంబర్ 4న 200కు పైగా థియేటర్లలో విడుదల ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ రిలీజ్.. ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పేలా అదిరిపోయిన విజువల్స్! ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేసిన మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ విడుదల: ఆకట్టుకుంటున్న యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ‘మా రాముడు అందరివాడు’.. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర విశేషాలు! జనసేన యువజన విభాగంగా ‘జై కొట్టు’ ఆవిర్భావం పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’తో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్! గోదావరి జలాలను విడుదల చేసిన చంద్రబాబు దేవరాయ'గా కిచ్చా సుదీప్: శ్రీకృష్ణదేవరాయ లుక్‌తో గ్లింప్స్ విడుదల పోలవరంపై క్రెడిట్ తీసుకునే దమ్ముందా జగన్? రంభ ఊర్వశి మేనక' హాయిగా నవ్వుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: హీరో అల్లరి నరేష్ రోమాంచకం' ఫ్యామిలీ అంతా చూసే ఫ్రెష్ లవ్ స్టోరీ: హీరో సుమంత్ ప్రభాస్

‘బెత్లెహెం కుడుంబ యూనిట్’తో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్!

Select Suryaa Now
‘బెత్లెహెం కుడుంబ యూనిట్’తో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్!

మలయాళంలో సంచలన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహెం కుడుంబ యూనిట్' తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమవుతోంది. నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రానికి 'ప్రేమలు' ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ విశేషాలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత ఫహద్ ఫాసిల్ మాట్లాడుతూ హైదరాబాద్ తనకు సొంతూరులా మారిందని, తెలుగు ప్రేక్షకుల ప్రేమ ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. 'ప్రేమలు'తో ఏర్పడిన అనుబంధం ఈ సినిమాతో మరింత బలపడుతుందని, గిరీశ్ ఏడీ మంచి రొమాంటిక్ కామెడీని అందించారని తెలిపారు.

హీరో నివిన్ పౌలీ మాట్లాడుతూ తెలుగులో రిలీజ్ అవుతున్న తన తొలి సినిమా ఇదేనని, ప్రేక్షకుల అందరి సపోర్ట్ కోరుకుంటున్నట్లు చెప్పారు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నైజాంలో విడుదల చేసిన మలయాళం వెర్షన్ రూ. 60 లక్షల గ్రాస్ సాధించిందని, ఈ స్పందన చూశాకే తెలుగులోనూ విడుదల చేయాలని డిసైడ్ అయ్యామని తెలిపారు. మలయాళంలో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించిందని, సెప్టెంబర్ 4న థియేటర్లలో ప్రేక్షకులు దీనిని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ 'ప్రేమలు'లాగే ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, దర్శకుడు గిరీశ్ ఏడీ, నటులు శ్యామ్ మోహన్, సంగీత్ మరియు ఫ్యూచర్ రన్‌అప్ ఫిల్మ్స్ అరుణ్ నారాయణ్ మాట్లాడుతూ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.