గోదావరి జలాలను విడుదల చేసిన చంద్రబాబు
పాయకరావుపేట సెప్టెంబర్ 2 మేజర్ న్యూస్:రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జల హారతి ఇచ్చి పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంద్ర జిల్లాలకు విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి జలాలను విడుదల చేసిన చంద్రబాబుకు జిల్లా రైతాంగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, అచ్చెం నాయుడు, ఎంపీ సీఎం రమేష్, తుని శాసనసభ్యురాలు యనమల దివ్య తదితరులు పాల్గొన్నారు.