BREAKING
‘దేవరాయ’గా కిచ్చా సుదీప్ రాయల్ ఎంట్రీ.. శ్రీకృష్ణదేవరాయ అవతార్‌లో అదరగొట్టిన అభినయ చక్రవర్తి! ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు రండి రాజనాథ్ సింగ్ కు సీఎం రేవంత్ ఆహ్వానం పవన్ కల్యాణ్ 55వ బర్త్‌డే గ్రాండ్ సెలబ్రేషన్.. మోదీ నుంచి చిరంజీవి వరకు స్పెషల్ విషెస్! తెలంగాణలో మరో సంచలనం - KCR ఫ్యామిలీలో చీలిక - కవిత సొంత పార్టీ గిరిజనుల జీవితాలతో ఆటలాడుతున్న జగన్‌.. పుట్టిన రోజునాడు పవన్ ఎక్కడ ? ఏపీ అసెంబ్లీలో హై వోల్టేజ్ డ్రామా - TTD లడ్డూ కల్తీ నుండి ఫ్రీ బస్సు వరకు - గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సెషన్ షురూ! వై ఎస్ కు సీఎం రేవంత్ ఘన నివాళి తెలంగాణలో ఓటర్ లిస్ట్ కలకలం - 73 లక్షల ఓట్లు గల్లంతు? - కాంగ్రెస్ vs ఎలక్షన్ కమిషన్ వార్! దివ్యాంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.. ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలి. జిల్లా కలెక్టర్ ఏపీలో ఎలక్షన్ ఫీవర్ - పంచాయతీ పోరుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ - 13 వేల పంచాయతీల్లో హై వోల్టేజ్ డ్రామా! బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అనకాపల్లి మైన్స్ కార్యాలయంలో రికార్డులు సేఫ్

గిరిజనుల జీవితాలతో ఆటలాడుతున్న జగన్‌..

Select Suryaa Now
గిరిజనుల జీవితాలతో ఆటలాడుతున్న  జగన్‌..

ఏపీ స్టేట్‌ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి: గిరిజనుల భవిష్యత్తుతో రాజకీయాల కోసం చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకునేది లేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని హెచ్చరించారు. గిరిజనుల సంక్షేమం, విద్య, అభివృద్ధి విషయంలో గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలను ప్రశ్నిస్తూ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోని జగన్‌కు ఇప్పుడు గిరిజనులపై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందా అని సంధ్యారాణి ప్రశ్నించారు. మహిళలు, గిరిజనుల గురించి జగన్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన మహిళా నాయకులు, రాజధాని మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రజలు మరిచిపోలేదన్నారు. గిరిజనుల ప్రయోజనాలను కాపాడే విషయంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. గిరిజనులకు కీలకమైన జీఓ నంబర్‌–3 విషయంలో సుప్రీంకోర్టులో నెలరోజుల్లోగా కౌంటర్‌ దాఖలు చేయకుండా వదిలేసిన వ్యక్తి ఇప్పుడు గిరిజనుల హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జీఓ–3ను తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదేనని, దానిని కాపాడేందుకు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.వైసీపీ పాలనలో ఐటీడీఏలను నిర్లక్ష్యం చేశారని, బెస్ట్‌ అవెయిలబుల్‌ స్కూల్స్‌, స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, విదేశీ విద్య వంటి గిరిజన విద్యాభివృద్ధి పథకాలను రద్దు చేశారని సంధ్యారాణి విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లోని సహజ వనరులు, ఖనిజ సంపద విషయంలోనూ గత ప్రభుత్వం సరైన రక్షణ కల్పించలేదని ఆరోపించారు. అప్పట్లో వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.