BREAKING
ఏపీ అసెంబ్లీలో హై వోల్టేజ్ డ్రామా - TTD లడ్డూ కల్తీ నుండి ఫ్రీ బస్సు వరకు - గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సెషన్ షురూ! వై ఎస్ కు సీఎం రేవంత్ ఘన నివాళి తెలంగాణలో ఓటర్ లిస్ట్ కలకలం - 73 లక్షల ఓట్లు గల్లంతు? - కాంగ్రెస్ vs ఎలక్షన్ కమిషన్ వార్! దివ్యాంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.. ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలి. జిల్లా కలెక్టర్ ఏపీలో ఎలక్షన్ ఫీవర్ - పంచాయతీ పోరుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ - 13 వేల పంచాయతీల్లో హై వోల్టేజ్ డ్రామా! బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అనకాపల్లి మైన్స్ కార్యాలయంలో రికార్డులు సేఫ్ జగిత్యాల నుండే రేవంత్ రెడ్డి పతనం ప్రారంభం ‘గేట్’ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోండి ముంబైలో సామాన్యులకు షాక్ - ఆటో, టాక్సీ ఛార్జీలు భారీగా పెంపు - జేబులకు చిల్లు పడినట్టే! రేవంత్ పై కొండా సురేఖ ఫైర్ దాయ్రా ఫుల్ స్టోరీ - కరీనా vs పృథ్వీరాజ్ - చట్టం vs న్యాయం మధ్య భీకర పోరు! రూపాయి పతనం ఆల్ టైమ్ లో - డాలర్ తో పోలిస్తే రూ.95.06 కు పడిపోయిన రూపాయి - RBI మాస్టర్ ప్లాన్!

ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలి. జిల్లా కలెక్టర్

Select Suryaa Now
ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలి. జిల్లా కలెక్టర్

ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలి.

సెప్టెంబర్ 16లోగా క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసుకోవాలి.

అర్హత కలిగిన ప్రతి పౌరుడు  ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగస్వామి కావాలి.            జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి, ; భారత ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ  ప్రక్రియ కొనసాగుతున్నందున, అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి, ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.ఎస్ఐఆర్ షెడ్యూల్‌లో భాగంగా 2026 ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరిగిందని తెలిపారు. ముసాయిదా జాబితాలో తమ పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాలను పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులు, మార్పులు లేదా అభ్యంతరాలు ఉన్నట్లయితే నిర్దేశిత గడువులోగా సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ) వద్ద క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేయాలని కోరారు.క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు గడువు సెప్టెంబర్ 16 వరకు ఉందని తెలిపారు. అర్హత కలిగిన పౌరులు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు, వివరాల సవరణ తదితర అంశాలకు సంబంధించి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సంబంధిత   ఈఆర్ఓ వద్ద నిర్దేశిత విధానంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు.ఎస్ఐఆర్
ప్రక్రియలో భాగంగా స్వీకరించిన క్లెయిమ్స్, అభ్యంతరాల జాబితాలను ప్రజల సమాచారార్థం అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. సంబంధిత ఈఆర్ఓ లు ఈ జాబితాలను వారానికి ఒకసారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేస్తారని పేర్కొన్నారు.జాబితాలో చేర్చిన ఏదైనా క్లెయిమ్‌పై అభ్యంతరం ఉన్న పౌరులు నిర్దేశిత విధానాన్ని అనుసరించి సంబంధిత ఈఆర్ఓ ను సంప్రదించవచ్చని తెలిపారు.క్లెయిమ్ లేదా అభ్యంతరంపై సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ) తీసుకున్న నిర్ణయంపై సంతృప్తి 
చెందని వారు  మొదటి అప్పీల్ అధికారిగా జిల్లా మేజిస్ట్రేట్ కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.అదేవిధంగా, మొదటి అప్పీల్ అధికారి ఇచ్చిన నిర్ణయంపై సంతృప్తి చెందని వారు రెండవ అప్పీల్ అధికారిగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని వివరించారు.ఎస్ ఐ ఆర్  ప్రక్రియకు సంబంధించిన సమాచారం ప్రతి అర్హత కలిగిన పౌరుడికి చేరేలా  ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ కోరారు.అర్హత కలిగిన ప్రతి పౌరుడు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని, అవసరమైన చోట క్లెయిమ్‌లు లేదా అభ్యంతరాలను నిర్దేశిత గడువులోగా దాఖలు చేసుకుని ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని  కలెక్టర్  కోరారు.