BREAKING
ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలి. జిల్లా కలెక్టర్ ఏపీలో ఎలక్షన్ ఫీవర్ - పంచాయతీ పోరుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ - 13 వేల పంచాయతీల్లో హై వోల్టేజ్ డ్రామా! బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అనకాపల్లి మైన్స్ కార్యాలయంలో రికార్డులు సేఫ్ జగిత్యాల నుండే రేవంత్ రెడ్డి పతనం ప్రారంభం ‘గేట్’ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోండి ముంబైలో సామాన్యులకు షాక్ - ఆటో, టాక్సీ ఛార్జీలు భారీగా పెంపు - జేబులకు చిల్లు పడినట్టే! రేవంత్ పై కొండా సురేఖ ఫైర్ దాయ్రా ఫుల్ స్టోరీ - కరీనా vs పృథ్వీరాజ్ - చట్టం vs న్యాయం మధ్య భీకర పోరు! రూపాయి పతనం ఆల్ టైమ్ లో - డాలర్ తో పోలిస్తే రూ.95.06 కు పడిపోయిన రూపాయి - RBI మాస్టర్ ప్లాన్! పిఎఫ్ఐ కార్యకర్తకు పెరోల్ సుప్రీంకోర్టులో సంచలన కేసు - గ్రాహం స్టెయిన్స్ హత్య దోషి దారా సింగ్ కు విడుదల దొరుకుతుందా? జమ్మూ కాశ్మీర్ లో హై టెన్షన్ - బీజేపీ ఆఫీసులకు JKNC ముట్టడి - రాష్ట్ర హోదా కోసం భారీ ధర్నా! నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందిస్తాం ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా-ఇరాన్ యుద్ధం - చమురు ధరలకు రెక్కలు - భారత్ స్టాక్ మార్కెట్ కుదేల్!

రేవంత్ పై కొండా సురేఖ ఫైర్

Select Suryaa Now
రేవంత్ పై కొండా సురేఖ ఫైర్

*సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ క్రమశిక్షణా కమిటీ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేసి తనపై చర్యలు తీసుకోవద్దని కోరారు. మహిళలు స్వతంత్రంగా జీవించాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెబుతున్నారని, అదే స్ఫూర్తితో మహిళలకు స్వేచ్ఛ ఉండాలని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

తన కుమార్తె స్వతంత్రంగా మాట్లాడిన విషయానికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని సురేఖ అన్నారు. తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

“పదేళ్లు సీఎంగా ఉంటాను” అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన సురేఖ.. అది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వ్యాఖ్య కాదా అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని బహిరంగంగా ప్రకటించడం పార్టీ నిర్ణయాలకు, క్రమశిక్షణకు సంబంధించిన అంశం కాదా అని నిలదీశారు.

తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే వివరణ ఇచ్చిన విషయాన్ని కూడా సురేఖ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తన కుటుంబ సభ్యుల వ్యాఖ్యలను తనకు ఆపాదించి చర్యలు తీసుకోవడం న్యాయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలకు స్వేచ్ఛ, స్వతంత్రత గురించి పార్టీ అగ్రనేతలు చెబుతున్న విషయాలను ఆచరణలోనూ పాటించాలని సూచించారు.

ఈ వ్యవహారంలో తనపై మాత్రమే కాకుండా, పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అన్ని వ్యాఖ్యలను ఒకే విధంగా పరిశీలించాలని సురేఖ కోరినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చినట్లైంది.