ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా-ఇరాన్ యుద్ధం - చమురు ధరలకు రెక్కలు - భారత్ స్టాక్ మార్కెట్ కుదేల్!
మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా? అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ భీకర యుద్ధం!ప్రపంచ దేశాలను వణికిస్తున్న షాకింగ్ న్యూస్ వచ్చేసింది. చాలా నెలలుగా చల్లబడింది అనుకున్న అమెరికా, ఇరాన్ మధ్య వివాదం మళ్లీ భగ్గుమంది. అమెరికా సైన్యం ఇరాన్ లోని కీలక ప్రాంతాలపై మరోసారి భారీ బాంబు దాడులు చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగడంతో గల్ఫ్ ప్రాంతం మొత్తం యుద్ధ వాతావరణం నెలకొంది.ఈ యుద్ధం ఎఫెక్ట్ వెంటనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $95.50 కి చేరుకుంది. ఇది గత ఆరు వారాల్లోనే అత్యధిక ధర. చమురు ధర పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది.భారత్ లో స్టాక్ మార్కెట్ కుదేల్ - ఇన్వెస్టర్లకు భారీ నష్టం!ఈ యుద్ధ టెన్షన్ నేరుగా భారత స్టాక్ మార్కెట్ పై పడింది. ఉదయం మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుండి మదుపర్లు అమ్మకాలకు దిగారు. నిఫ్టీ 0.82% పడిపోయి 23,858 పాయింట్లకు చేరింది. అలాగే సెన్సెక్స్ కూడా 0.61% నష్టపోయి 76,471 వద్ద ట్రేడ్ అవుతోంది. అన్ని 16 ప్రధాన రంగాల షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి.నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికాలో వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుండి డబ్బును వెనక్కి తీసుకునే ప్రమాదం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.