పిఎఫ్ఐ కార్యకర్తకు పెరోల్
సూర్య జగిత్యాల ప్రతినిధి:దేశంలో నిషేధిత పిఎఫ్ఐ కార్యకర్తగా పని చేసి 33 నెలల క్రితం ఎన్ ఐ ఏ అధికారులు అరెస్ట్ చేసిన జగిత్యాలకు చెందిన అబ్దుల్ సలీంను చంచల్ గూడా జైల్లో నుండి పెరోలు పై విడుదల చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు బుధవారం జగిత్యాలకు తీసుకొచ్చారు. సలీంకు చిన్నమ్మ మృతి, కుటుంబ సభ్యుల అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఒక రోజు ఫెరోలు మంజూరు అయ్యింది. పెరోలు గడువు ముగిసిన అనంతరం అతన్ని తిరిగి జైలుకు తరలించనున్నారు