సుప్రీంకోర్టులో సంచలన కేసు - గ్రాహం స్టెయిన్స్ హత్య దోషి దారా సింగ్ కు విడుదల దొరుకుతుందా?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్రాహం స్టెయిన్స్ హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 1999లో ఒడిశాలో ఆస్ట్రేలియా మిషనరీ గ్రాహం స్టెయిన్స్ ను, ఆయన ఇద్దరు చిన్న కొడుకులను సజీవ దహనం చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దారా సింగ్ అలియాస్ రవీంద్ర పాల్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.గత జులైలోనే సుప్రీంకోర్టు ఒడిశా ప్రభుత్వాన్ని ఒక నెలలోపు దారా సింగ్ రిమిషన్ పై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఆ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టే ఈ కేసును విచారించబోతోంది.అసలేం జరిగింది?
1999 జనవరిలో ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో గ్రాహం స్టెయిన్స్ తన ఇద్దరు పిల్లలతో కలిసి కారులో నిద్రిస్తుండగా, దారా సింగ్ తన అనుచరులతో కలిసి కారుకు నిప్పు పెట్టాడు. ఈ దారుణం అప్పట్లో ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ కేసులో దారా సింగ్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.ఇప్పుడు 27 ఏళ్లుగా జైలులో ఉన్న దారా సింగ్ తనను విడుదల చేయాలని కోరుతున్నాడు. మరి సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందో అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.