BREAKING
వై ఎస్ కు సీఎం రేవంత్ ఘన నివాళి తెలంగాణలో ఓటర్ లిస్ట్ కలకలం - 73 లక్షల ఓట్లు గల్లంతు? - కాంగ్రెస్ vs ఎలక్షన్ కమిషన్ వార్! దివ్యాంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.. ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలి. జిల్లా కలెక్టర్ ఏపీలో ఎలక్షన్ ఫీవర్ - పంచాయతీ పోరుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ - 13 వేల పంచాయతీల్లో హై వోల్టేజ్ డ్రామా! బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అనకాపల్లి మైన్స్ కార్యాలయంలో రికార్డులు సేఫ్ జగిత్యాల నుండే రేవంత్ రెడ్డి పతనం ప్రారంభం ‘గేట్’ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోండి ముంబైలో సామాన్యులకు షాక్ - ఆటో, టాక్సీ ఛార్జీలు భారీగా పెంపు - జేబులకు చిల్లు పడినట్టే! రేవంత్ పై కొండా సురేఖ ఫైర్ దాయ్రా ఫుల్ స్టోరీ - కరీనా vs పృథ్వీరాజ్ - చట్టం vs న్యాయం మధ్య భీకర పోరు! రూపాయి పతనం ఆల్ టైమ్ లో - డాలర్ తో పోలిస్తే రూ.95.06 కు పడిపోయిన రూపాయి - RBI మాస్టర్ ప్లాన్! పిఎఫ్ఐ కార్యకర్తకు పెరోల్

బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Select Suryaa Now
బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

 

సూర్య కరీంనగర్ ప్రతినిధి: కరీంనగర్ జిల్లాలో బుధవారం పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. బస్సు సగం భాగం బావిపై వేలాడుతూ ఆగిపోవడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న బస్సు సుందరగిరి శివారుకు చేరుకోగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.