BREAKING
పుట్టిన రోజునాడు పవన్ ఎక్కడ ? ఏపీ అసెంబ్లీలో హై వోల్టేజ్ డ్రామా - TTD లడ్డూ కల్తీ నుండి ఫ్రీ బస్సు వరకు - గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సెషన్ షురూ! వై ఎస్ కు సీఎం రేవంత్ ఘన నివాళి తెలంగాణలో ఓటర్ లిస్ట్ కలకలం - 73 లక్షల ఓట్లు గల్లంతు? - కాంగ్రెస్ vs ఎలక్షన్ కమిషన్ వార్! దివ్యాంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.. ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలి. జిల్లా కలెక్టర్ ఏపీలో ఎలక్షన్ ఫీవర్ - పంచాయతీ పోరుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ - 13 వేల పంచాయతీల్లో హై వోల్టేజ్ డ్రామా! బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అనకాపల్లి మైన్స్ కార్యాలయంలో రికార్డులు సేఫ్ జగిత్యాల నుండే రేవంత్ రెడ్డి పతనం ప్రారంభం ‘గేట్’ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోండి ముంబైలో సామాన్యులకు షాక్ - ఆటో, టాక్సీ ఛార్జీలు భారీగా పెంపు - జేబులకు చిల్లు పడినట్టే! రేవంత్ పై కొండా సురేఖ ఫైర్ దాయ్రా ఫుల్ స్టోరీ - కరీనా vs పృథ్వీరాజ్ - చట్టం vs న్యాయం మధ్య భీకర పోరు!

కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట..

Select Suryaa Now
కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట..

కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట..వెయ్యి రోజులు గడిచినా అమలుకు నోచుకోని హామీలు..420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన,ప్రజలకు ‘బాకీ కార్డుల’ పంపిణీ..

మెదక్ ; కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి.. వెయ్యి రోజులు గడుస్తున్నా వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం మెదక్‌లో నిరసన చేపట్టారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి.సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ బట్టి జగపతి,పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.మెదక్‌ పట్టణంలోని హెడ్‌ పోస్టాఫీస్‌ వద్ద అంబేద్కర్‌ చౌరస్తా నుంచి రాందాస్‌ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి నెరవేర్చని హామీలు  420 అడుగుల పొడవైన ఫ్లెక్సీతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ‘బాకీ కార్డులు’ ముద్రించి ప్రజలకు పంపిణీ చేశారు. హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని వివరిస్తూ పంపిణీ చేశారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.