పోలవరం ఎడమ కాలువ శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
పాయకరావుపేట సెప్టెంబర్ 2 మేజర్ న్యూస్: పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు నీరు ఇస్తున్నందుకు సూచికగా ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాయకరావుపేట వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు,వంగల పూడి అనిత,ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. ఎడమ కాలువ నుంచి అనకాపల్లి జిల్లా వరకూ వచ్చిన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. కూటమి ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి శిలా ఫలకం వద్ద ఫోటోలు దిగిన చంద్రబాబు.