BREAKING
సుడిగాలి సుధీర్ ‘GOAT’.. సెప్టెంబర్ 11న థియేటర్లలో యాక్షన్ కామెడీ దుమ్మురేపనున్నాడా? కార్తీ ‘సర్దార్ 2’.. సెప్టెంబర్ 10న థియేటర్లలో స్పై యాక్షన్ ధమాకా! కాంగ్రెస్ పార్టీ హామీల మోసాలపై.. బిఆర్ఎస్ పోరుబాట మ్యాజిక్కా.... మజాకానా పుష్పక విమానాన్ని తలపిస్తున్న టాటా మ్యాజిక్ లు పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 1.11 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్ రోజూ వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ 8 విషయాలు తప్పక తెలుసుకోండి.. ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్స్! అశ్వాపురంలో కారులో తరలిస్తున్న 40 కిలోల గంజాయి పట్టివేత: ఒడిశా దంపతుల అరెస్ట్ వైద్య కళాశాల, జీజీహెచ్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యం. మంత్రి దామోదర్ రాజనర్సింహ రాజేంద్రనగర్ జోన్‌లో.. 'సర్' హియరింగ్ ప్రక్రియ పరిశీలన బండ్లగూడ, హైదర్‌షాకోట్, శివరాంపల్లి కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్హత లేని వైద్యుడితో వైద్యం.. సూర్య హాస్పిటల్‌కు షోకాజ్.. ..మెట్‌పల్లిలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు.. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేసిన మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ విడుదల: ఆకట్టుకుంటున్న యూత్‌ఫుల్ లవ్ స్టోరీ జనసేన యువజన విభాగంగా ‘జై కొట్టు’ ఆవిర్భావం పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి

Select Suryaa Now
పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి

సర్పంచ్ సుతారి రమాదేవి, మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య 

ఆళ్లపల్లి సూర్య మేజర్ న్యూస్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం మండల పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్ సుతారి రమాదేవి, మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య డాక్టర్ వైఎస్ ఆర్ సేవలను కొనియాడుతూ,వైఎస్ఆర్ ఒక వ్యక్తి కాదు... ఒక శకం అని పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని అన్నారు.

 ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, జలయజ్ఞం లాంటి ఎన్నో పథకాలతో తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని. ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీనే ముందుకు  తీసుకెళ్లిందని అన్నారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో రైతుల అభ్యున్నతికి ప్రత్యేకంగా కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు.నేటి యువతకు వైఎస్ఆర్ ఆదర్శప్రాయుడని,వారి ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో సర్పంచులు రామనర్సయ్య,చంద్రశేఖర్, సూర్యకాంత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి వెంకన్న,కాంతు, సుతారి కృష్ణ,చిరంజీవి, వెంకటాచారి,ఉపసర్పంచ్ వగలబోయిన సతీష్, శ్రీకాంత్,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఇనుముల ఇందు కుమార్,కీసరి లాల్,వేణు,వార్డు మెంబర్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.