పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి
సర్పంచ్ సుతారి రమాదేవి, మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య
ఆళ్లపల్లి సూర్య మేజర్ న్యూస్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం మండల పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్ సుతారి రమాదేవి, మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య డాక్టర్ వైఎస్ ఆర్ సేవలను కొనియాడుతూ,వైఎస్ఆర్ ఒక వ్యక్తి కాదు... ఒక శకం అని పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని అన్నారు.
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, జలయజ్ఞం లాంటి ఎన్నో పథకాలతో తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని. ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీనే ముందుకు తీసుకెళ్లిందని అన్నారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో రైతుల అభ్యున్నతికి ప్రత్యేకంగా కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు.నేటి యువతకు వైఎస్ఆర్ ఆదర్శప్రాయుడని,వారి ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు రామనర్సయ్య,చంద్రశేఖర్, సూర్యకాంత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి వెంకన్న,కాంతు, సుతారి కృష్ణ,చిరంజీవి, వెంకటాచారి,ఉపసర్పంచ్ వగలబోయిన సతీష్, శ్రీకాంత్,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఇనుముల ఇందు కుమార్,కీసరి లాల్,వేణు,వార్డు మెంబర్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.