BREAKING
278 మంది లబ్ధిదారులకు రూ.1.39 కోట్లు పంపిణీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 వచ్చేస్తోంది.. సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా షో ప్రారంభం! 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించాలి రవితేజ ‘ఇరుముడి’కి బాక్సాఫీస్ షేక్.. జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా సెన్సేషన్! సుడిగాలి సుధీర్ ‘GOAT’.. సెప్టెంబర్ 11న థియేటర్లలో యాక్షన్ కామెడీ దుమ్మురేపనున్నాడా? కార్తీ ‘సర్దార్ 2’.. సెప్టెంబర్ 10న థియేటర్లలో స్పై యాక్షన్ ధమాకా! కాంగ్రెస్ పార్టీ హామీల మోసాలపై.. బిఆర్ఎస్ పోరుబాట మ్యాజిక్కా.... మజాకానా పుష్పక విమానాన్ని తలపిస్తున్న టాటా మ్యాజిక్ లు పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 1.11 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్ రోజూ వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ 8 విషయాలు తప్పక తెలుసుకోండి.. ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్స్! అశ్వాపురంలో కారులో తరలిస్తున్న 40 కిలోల గంజాయి పట్టివేత: ఒడిశా దంపతుల అరెస్ట్ వైద్య కళాశాల, జీజీహెచ్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యం. మంత్రి దామోదర్ రాజనర్సింహ రాజేంద్రనగర్ జోన్‌లో.. 'సర్' హియరింగ్ ప్రక్రియ పరిశీలన బండ్లగూడ, హైదర్‌షాకోట్, శివరాంపల్లి కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్హత లేని వైద్యుడితో వైద్యం.. సూర్య హాస్పిటల్‌కు షోకాజ్.. ..మెట్‌పల్లిలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు..

278 మంది లబ్ధిదారులకు రూ.1.39 కోట్లు పంపిణీ

Select Suryaa Now
278 మంది లబ్ధిదారులకు రూ.1.39 కోట్లు పంపిణీ

 

రంగారెడ్డి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 2) : మైనార్టీ మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మహమ్మద్ అజహరోద్దిన్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా యోజన కింద రూ.1.39 కోట్ల ఆర్థిక సాయాన్ని 278 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా యోజన కింద మొత్తం 278 మంది లబ్ధిదారులకు రూ.1.39 కోట్లను అందజేశారు. నిరాశ్రయులు, విడాకులు పొందిన మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున మంజూరు చేశారు.

అదే విధంగా తుర్క కాషా ముస్లిం కమ్యూనిటీకి చెందిన పేద కుటుంబాలకు రూ.60 వేల విలువ చేసే 13 టూల్ కిట్లు, జనరేటర్లను అందజేశారు. ఈ పథకాల ద్వారా మైనార్టీ మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.