BREAKING
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్స్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి సర్పంచ్ కాదు నిజమైన ప్రజాసేవకురాలు సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీలో మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం' 7 పి.ఎం. ప్రొడక్షన్స్ కొత్త సినిమా 'ఇ.ఎం.ఐ' పూజా కార్యక్రమాలతో ప్రారంభం! 278 మంది లబ్ధిదారులకు రూ.1.39 కోట్లు పంపిణీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 వచ్చేస్తోంది.. సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా షో ప్రారంభం! 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించాలి రవితేజ ‘ఇరుముడి’కి బాక్సాఫీస్ షేక్.. జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా సెన్సేషన్! సుడిగాలి సుధీర్ ‘GOAT’.. సెప్టెంబర్ 11న థియేటర్లలో యాక్షన్ కామెడీ దుమ్మురేపనున్నాడా? కార్తీ ‘సర్దార్ 2’.. సెప్టెంబర్ 10న థియేటర్లలో స్పై యాక్షన్ ధమాకా! కాంగ్రెస్ పార్టీ హామీల మోసాలపై.. బిఆర్ఎస్ పోరుబాట మ్యాజిక్కా.... మజాకానా పుష్పక విమానాన్ని తలపిస్తున్న టాటా మ్యాజిక్ లు పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 1.11 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్ రోజూ వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ 8 విషయాలు తప్పక తెలుసుకోండి.. ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్స్!

సర్పంచ్ కాదు నిజమైన ప్రజాసేవకురాలు

Select Suryaa Now
సర్పంచ్ కాదు నిజమైన ప్రజాసేవకురాలు

పార పట్టి రోడ్డు శుభ్రం చేసిన ప్రజాసేవకురాలు పగడాల రమాదేవి..

దమ్మపేట, సూర్య (మేజర్ న్యూస్) :  బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజా సమస్యలపై మెరుపు వేగంతో స్పందిస్తూ, నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా శ్రమిస్తున్న దమ్మపేట స్థానిక సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు సేవాతత్పరత, నిబద్ధత మరోసారి నిరూపితమయ్యాయి. నిగర్విగా, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ఆమె, తాజాగా మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఒక ప్రమాదకర సమస్యపై తక్షణమే స్పందించి తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రశంసలు అందుకున్నారు. ఎయిర్‌టెల్ టవర్ నుంచి మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లే రహదారిని మందుబాబులు అడ్డాగా మార్చుకుని, తాగి పారేసిన మద్యం సీసాలను రోడ్డుపైనే పగలగొట్టి ఉన్మాదం ప్రదర్శించారు. పవిత్రమైన ఆలయానికి వెళ్లే దారిలో, నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే మార్గంలో ఇలాంటి వికృత చేష్టల వల్ల కాలినడకన వెళ్లే భక్తులతో పాటు మూగజీవాల కాళ్లు తెగిపోయే ప్రమాదకర పరిస్థితి ఏర్పడటంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రంగంలోకి దిగారు.

సమాచారం అందుకున్న వెంటనే రమాదేవి గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాధారణంగా అధికారులు లేదా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి వదిలేసే సంస్కృతికి భిన్నంగా, ఆమె ప్రజల భద్రత కోసం తానే స్వయంగా చేతుల్లోకి పార తీసుకున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపై విస్తరించిన గాజు ముక్కలను స్వహస్తాలతో ఏరివేస్తూ పారిశుధ్య కార్మికురాలిగా మారిపోయారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఎలాంటి అహంభావం లేకుండా ఆమె స్వయంగా చెత్తను శుభ్రం చేయడం అక్కడి వారిని ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. ఆ తర్వాత పంచాయతీ సిబ్బందిని రంగంలోకి దించి, జెసిపి  యంత్రం సహాయంతో ఆ ప్రాంతంలో మిగిలిపోయిన వ్యర్థాలను, ప్రమాదకరమైన గాజు ముక్కలను పూర్తిగా ప్రక్షాళన చేయించారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తానే స్వయంగా శ్రమించి, ఆ దారినంతటినీ అద్దంలా శుభ్రం చేయించిన ప్రజాసేవకురాలు రమాదేవి సేవాతత్పరతపై దమ్మపేట ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా స్పందించి ఆదర్శంగా నిలిచిన ఆమె చొరవను మండలంలోని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఇలాంటి పవిత్ర స్థలాల్లో మద్యం తాగుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఆకతాయిల ఆటకట్టించాలని, వారిని గుర్తించి పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.