BREAKING
వెండి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు నిలకడగా కొనసాగుతున్న సిల్వర్ రేట్లు! ఏరోస్పేస్‌, డిఫెన్స్ రంగంలోకి మంత్రి పొంగులేటి కుటుంబం తుక్కుగూడ హత్యాచార బాధితురాలి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ నేడు తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. పసిడి ప్రియులకు ఊరట! హ్యారీ, మేఘన్ అమెరికాను విడిచి వెళ్లడంపై డోనాల్డ్ ట్రంప్ సంతోషం 166 మంది భారతీయుల రక్షణ.. సహాయక చర్యలను తీవ్రతరం చేసిన భారత్ రేవా బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు 1,200 దాటిన మృతుల సంఖ్య, 4 వేల మందికి పైగా గల్లంతు ఇరాన్‌పై అమెరికా దాడి.. టెహ్రాన్ తీవ్ర ప్రతిదాడి శాంతి ఒప్పందానికి సిద్ధమైనప్పుడే పుతిన్‌తో భేటీ ఢిల్లీలో ఖర్గే, మీనాక్షి నటరాజన్‌లతో కొండా సురేఖ భేటీ భారత్‌లో అడుగుపెట్టిన బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధగధగలు హామీలకే పరిమితమైన గిరిజనుల ఆశలు: నందిగరువులో అమలుకు నోచుకోని జనసేన ఆవిర్భావ సభ వాగ్దానాలు

తుక్కుగూడ హత్యాచార బాధితురాలి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

Select Suryaa Now
తుక్కుగూడ హత్యాచార బాధితురాలి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేత
హైదరాబాద్/కొత్తగూడెం: తుక్కుగూడలో దారుణంగా ఉన్మాది చేతిలో హత్యాచారానికి గురైన నర్సు కుటుంబానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి అండగా ఉంటామని భరోసానిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్‌లో మాట్లాడి, వారిని పరామర్శించారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ పరంగా పోరాడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, దోషికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు.


కేటీఆర్ సూచనల మేరకు బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు చౌటిగూడెంలోని బాధిత యువతి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, రూ. 50,000 తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రభుత్వం నుంచి తగిన పరిహారం మరియు బాధితులకు వేగవంతమైన న్యాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.