అక్రమంగా తరలిస్తున్న మట్టి తిప్పర్ల పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న మట్టి తిప్పర్ల పట్టివేత
శివంపేట్ : శివంపేట్ మండలం పరిధిలోని దంతాన్పల్లి గ్రామ శివారులోని దేవుని చెరువు నుంచి అక్రమంగా అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న 4 టిప్పర్లను పట్టుకున్నట్లు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు వివరాలు ఇలా ఉన్నాయి.. దంతాన్పల్లి శివారులో దేవుని చెరువు నుంచి నలుగురు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మట్టిబండ్లు కనిపించాయి. దీంతో టిప్పర్ డ్రైవర్ పట్టుకొని విచారించగా తూప్రాన్ మండలం నాగాలపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సూచనల మేరకు తాము తూప్రాన్ కు మట్టిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు తీసుకొని దర్యాప్తు చేర్పడుతున్నట్టు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు. పట్టుకున్న టిప్పర్లను సీజ్ చేసి శివంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించి నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.