BREAKING
అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్.. అందరూ కట్టుబడి ఉండాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాగుంటపై నోరుపారేసుకుంటే సహించేది లేదు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ నిరంతర పోరాటం 'రోమాంచకం' థియేటర్లలో సందడి చేస్తోంది: యూత్ కంటెంట్‌తో నేడు ప్రేక్షకుల ముందుకు! వెలిగొండపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ఆకట్టుకుంటున్న ‘ఏరై పారే హృదయం’ గీతం.. విడుదల చేసిన డా. సీహెచ్. ప్రీతిరెడ్డి! ఘనంగా "జయహో రామానుజ" సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్.. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! నేడు అనుచరులతో కొండా సురేఖ భేటీ.. Toxic Box Office Collection Day 8: మొదటి వారం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయిన యాష్ సినిమా నీటి వివాదం.. యోగీ ప్రభుత్వ వేధింపులకు ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ రాజీనామా? హోండా నుంచి 10 కొత్త టూవీలర్లు: రెబెల్ క్రూయిజర్లు, ADV 160, QC3 ఈవీ స్కూటర్ ఆవిష్కరణ మధ్యమానేరు జలాశయం నుండి కాలువ ద్వారా సాగుకోసం నీటిని విడుదలకై రైతుల రాస్తారోకో. జైలు ఖైదీకి ప్రత్యేక గది.. అధికారిణిపై బదిలీ వేటు, అసలేం జరిగిందంటే? శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ సీఈఓగా జితేంద్ర మిశ్రా నియామకంపై ఎన్.రామచందర్ రావు హర్షం భారత్-బెల్జియం రక్షణ మంత్రుల ద్వైపాక్షిక చర్చలు

అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్.. అందరూ కట్టుబడి ఉండాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Select Suryaa Now
అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్.. అందరూ కట్టుబడి ఉండాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

యాదాద్రి జిల్లా: కొండా సురేఖ వ్యవహారంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ పార్టీ పెద్దలను కలిసి తన వాదనను వినిపించారని తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధిష్ఠానం వద్ద పూర్తి సమాచారం ఉందని చెప్పారు.

అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని, పార్టీ నేతలంతా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనేది పూర్తిగా అధిష్ఠానం ఇష్టమని పేర్కొన్నారు.

రాహుల్‌ గాంధీపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. క్యాబినెట్‌ విస్తరణ ఎప్పుడు జరగాలనే అంశంపై కూడా అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

తాను ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల గురించి ఆలోచిస్తున్నానని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌పై పోరాడిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు న్యాయం జరగాలని ఆయన అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.