telanagana
అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్.. అందరూ కట్టుబడి ఉండాలి: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
Telanagana
03 Sep 2026
25 views
By సూర్య ప్రతినిధి
Updated : 03 Sep 2026 14:04 IST
Select Suryaa Now
యాదాద్రి జిల్లా: కొండా సురేఖ వ్యవహారంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ పార్టీ పెద్దలను కలిసి తన వాదనను వినిపించారని తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధిష్ఠానం వద్ద పూర్తి సమాచారం ఉందని చెప్పారు.
అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని, పార్టీ నేతలంతా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనేది పూర్తిగా అధిష్ఠానం ఇష్టమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాజగోపాల్రెడ్డి అన్నారు. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరగాలనే అంశంపై కూడా అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
తాను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఆలోచిస్తున్నానని రాజగోపాల్రెడ్డి చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్పై పోరాడిన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలని ఆయన అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.