BREAKING
UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్‌ కంటే బలమైన అర్హత ఏ దేశానికీ లేదు: ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ ​గోవా కోర్టులో లొంగిపోయిన ‘తెహెల్కా’ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ​పనాజీ: ఉమ్మడి జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎల్లంపేట మున్సిపల్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నేశ్వరుని తొలి పూజలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మట్టి గణపతి తోనే పర్యావరణ పరిరక్షణ* *జిల్లా కలెక్టర్ బంగ్లాలో వినాయక చవితి పూజలు* వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తిరుమల జి ఎన్ సి టోల్గేట్ వద్ద చిరుత కలకలం కార్గిల్ యుద్ధ వీరుడుపై ఇనుప రాడ్ తో దాడి విఘ్నాలను తొలగించి.. విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, పవిత్రమైన "వినాయక చవితి" సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐపీసి చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కలిసిన సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ వినాయకుని కృపతో ప్రతి అడుగులో విజయాలు చేకూరాలి కళాకారుల బతుకులతో ఆటలాడుతున్న... కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం-గిలకత్తుల రమెష్ గౌడ్ యాసిడ్ దాడిలో గాయపడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి మల్లేనిపల్లి వినాయక చవితి కి రూ. 10,116 విరాళం అందజేసిన టిడిపి నేత చంద్ర * పరిటాల శ్రీరామ్ సూచనలతో ఆర్థిక సాయం

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు

Select Suryaa Now
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు

సెప్టెంబర్‌లో రూ. 14,474 కోట్ల ఎఫ్‌పీఐ నిధుల ఉపసంహరణ
ముంబై: మధ్యప్రాచ్యంలో రోజురోజుకూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ (ముడిచమురు) ధరల మంట విదేశీ ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచాయి. దీంతో సెప్టెంబర్ 12వ తేదీ నాటికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) భారత స్టాక్ మార్కెట్లలోని ఎక్స్ఛేంజీల ద్వారా రూ. 14,474 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు, సెప్టెంబర్‌లో మాత్రం అమ్మకాల బాట పట్టారు.

అయితే, సెకండరీ మార్కెట్‌లో అమ్మకాలు సాగినప్పటికీ ప్రైమరీ మార్కెట్ (ఐపీఓలు) ద్వారా మాత్రం పెట్టుబడులు పర్వాలేదనిపించాయి. సెప్టెంబర్ 12 నాటికి ప్రైమరీ మార్కెట్‌లో ఎఫ్‌పీఐలు రూ. 1,336 కోట్లు ఇన్వెస్ట్ చేయడంతో, ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్ ద్వారా వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడులు రూ. 47,183 కోట్లకు చేరాయి.

మార్కెట్లపై ఒత్తిడి – మద్దతుగా డీఐఐలు
విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు, చమురు ధరకు రెక్కలు రావడం వల్ల నిఫ్టీ-50 సూచీ వరుసగా ఐదో వారం కూడా నష్టాలతో ముగిసింది. చమురు భయాలు ద్రవ్యోల్బణాన్ని పెంచి, వడ్డీ రేట్ల కోత ప్రక్రియను నెమ్మదింపజేస్తాయన్న భయాలు మార్కెట్ వర్గాల్లో కనిపిస్తున్నాయి.

ఈ తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) మార్కెట్‌ను ఆదుకున్నారు. డీఐఐలు ఈ వారంలో రూ. 6,419.46 కోట్ల నికర కొనుగోళ్లు జరిపి, సూచీల పతనాన్ని కొంతవరకు కట్టడి చేశారు. రాబోయే రోజుల్లో ఇరాన్-అమెరికా ఘర్షణల సరళి, గ్లోబల్ స్థూల ఆర్థిక పరిస్థితులు మరియు ముడిచమురు ధరల గమనమే భారత మార్కెట్ల దిశను నిర్ణయించనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.