టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు
టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు
సూర్య, స్టేట్ బ్యూరో : అమరావతి
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విఘ్నేశ్వరుడికి టీడీపీ నాయకులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి పుష్పాలంకరణ చేసి, వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
టీడీపీ నాయకులు విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, పార్టీకి, రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు, సుభిక్షం కలగాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగించి, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని గణనాథుడిని ప్రార్థించారు.
వినాయక చవితి సందర్భంగా జాతీయ కార్యాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.