వినాయకునికి ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు
వినాయకునికి ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలులో ఏర్పాటు చేసిన శ్రీ గణనాథుని విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల ఆకాంక్షించారు.