|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 01:47 PM
న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయని ఇన్చార్జ్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నగరంలో భారీగా జనం కదలికలు ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్లకు మినహాయింపు ఇస్తూ, మిగిలిన ఫ్లైఓవర్లన్నింటినీ పరిస్థితిని బట్టి రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం వరకు మూసివేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. నగరంలోకి వచ్చే అన్ని ప్రైవేటు వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మళ్లించాలని సూచించారు. ముఖ్యంగా ట్యాంక్బండ్, నెక్లస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వంటి రద్దీ ప్రాంతాల్లో రాత్రి 11 నుంచి 2 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు.భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు నగరవ్యాప్తంగా 217 ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. షాపింగ్ మాల్స్, పబ్లు, పార్టీ హబ్లుగా మారే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పీవీ ఎక్స్ప్రెస్ హైవే పైకి వెళ్లాలంటే తప్పనిసరిగా ఫ్లైట్ టికెట్ చూపించాల్సిందేనని స్పష్టం చేశారు.