కూతురి వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం
కొండా మురళీ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తమ కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నాయకుడు కొండా మురళీ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అధినేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. తమ కుమార్తె (కొండా సుస్మిత) చేసిన వ్యాఖ్యలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఈ అంశంపై నిర్ణయం వెలువరించే వరకు తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని కొండా మురళీ స్పష్టం చేశారు.