రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్
న్యూఢిల్లీ: పుణెలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన 'ఛత్రో కీ గూంజ్' కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో రాహుల్ గాంధీ కొత్త తప్పుడు కథనాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
'పితృస్వామ్యాన్ని కూల్చివేయడం' (Dismantling Patriarchy) అనే భావనను తాను సమర్థిస్తున్నానని, కానీ రాహుల్ గాంధీ ఆ నినాదాన్ని పుణె వేదికకే పరిమితం చేశారా అని బాన్సురీ స్వరాజ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ పితృస్వామ్యానికి ఆశ్రయం కల్పిస్తున్నారని విమర్శించారు. ఆగస్టు 22న తన పరిశోధనా బృందం వద్ద ఉన్న అరకొర సమాచారంతో రాహుల్ గాంధీ దేశ ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో చౌకబారు ప్రచారం కోసం మిత్రదేశమైన ఇటలీ మహిళా ప్రధానమంత్రిని (జార్జియా మలోని) ఉద్దేశించి చేసిన అసభ్యకరమైన జోక్లో రాహుల్ గాంధీ పాలుపంచుకున్నారని మండిపడ్డారు. కేవలం సంచలనం కోసమే రాహుల్ గాంధీ ఇటువంటి నిందలకు, చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని బాన్సురీ స్వరాజ్ విమర్శించారు.