గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే E20 పెట్రోల్పై నిషేధం
అరవింద్ కేజ్రీవాల్ సంచలన హామీ
పణాజీ: గోవాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) విక్రయాలపై తక్షణమే నిషేధం విధిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. 2027 మార్చి 10 తర్వాత గోవాలో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన కేవలం 5 రోజుల్లోనే ఈ E20 పెట్రోల్ అమ్మకాలను నిలిపివేస్తామని ఆయన సంచలన హామీ ఇచ్చారు.
ఇథనాల్తో కలిపిన E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయని, దీనివల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. పెట్రోల్లో కలిపేందుకు ఇథనాల్ ఉత్పత్తిని విపరీతంగా పెంచడం వల్ల మార్కెట్లో చక్కెర ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలపై అదనపు భారం పడుతోందని విమర్శించిన కేజ్రీవాల్, గోవా ప్రజల ప్రయోజనాలు మరియు వారి వాహనాల భద్రతను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.