BREAKING
రేవంత్ రెడ్డికి ఏఐసీసీ వాలంటీర్స్ కమిటీ షోకాజ్ నోటీసులు! బీజింగ్‌లో 25వ ప్రత్యేక ప్రతినిధుల సమావేశం న్యూఢిల్లీలో ఘనంగా జాతీయ షిప్పింగ్ బోర్డ్ తొలి 'సాగర్ సంవాద్' హోర్ముజ్ జలసంధిలో మందుపాతరలు తొలగించాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ కాంస్య పతక విజేతలు గాయత్రి - త్రిసా జాలీ ‘ఆపరేషన్ సింధూర్’ విజయం వెనుక స్పష్టమైన వ్యూహం తప్పులతడకగా స్మార్ట్ రేషన్ కార్డులు కంటతడి పెట్టిస్తున్న ఎరువుల కొరత మండలంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం. కంగనా-తాప్సీ వివాదం ఎప్పుడు ముగుస్తుంది? తాప్సీ క్లారిటీ.. మీడియాపైనే అసహనం Toxic Movie: టాక్సిక్ సినిమా ఫస్ట్ రివ్యూ.. రోడ్డు దుమ్మును తగ్గించి, వాయు నాణ్యతను మెరుగుపరచేందుకు వర్క్‌షాప్ పాలు, పనీర్‌ ప్యాకెట్‌ ఉబ్బిందా? ఎక్స్‌పైరీ చూడటం సరిపోదు.. ఈ విషయం తెలుసుకోండి! మొక్కలు నాటుదాం... పర్యావరణం కాపాడుదాం... కృతి సనన్‌ ఘాటు కౌంటర్‌.. ‘సంస్కృతి గుండెల్లో ఉంటుంది.. దుస్తుల్లో కాదు’

రేవంత్ రెడ్డికి ఏఐసీసీ వాలంటీర్స్ కమిటీ షోకాజ్ నోటీసులు!

Select Suryaa Now
రేవంత్ రెడ్డికి ఏఐసీసీ వాలంటీర్స్ కమిటీ షోకాజ్ నోటీసులు!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఛాత్రోంకి గూంజ్" (విద్యార్థుల గళం) కార్యక్రమానికి మద్దతు ఇవ్వలేదనే కారణంతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్. రేవంత్ రెడ్డికి ఆల్ ఇండియా కాంగ్రెస్ వాలంటీర్స్ కమిటీ (AICVC) బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కార్యక్రమానికి ఎందుకు మద్దతు తెలపలేదో, హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని కోరుతూ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులపై తక్షణమే స్పందించి, తగిన కారణాలను వివరిస్తూ 72 గంటల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని AICVC స్పష్టం చేసింది. కేవలం సీఎం రేవంత్ రెడ్డికి మాత్రమే కాకుండా పార్టీకి చెందిన పలువురు కీలక నేతలకు కూడా కమిటీ నోటీసులు పంపింది.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వి.డి. సతీషన్
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ

వీరందరూ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిర్వహించిన విద్యార్థుల అవగాహన, సమస్యల పోరాట కార్యక్రమం "ఛాత్రోంకి గూంజ్"కు ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వకపోవడంపై ఏఐసీసీ వాలంటీర్స్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ చర్యలు చేపట్టింది.