200 రోజుల తర్వాత థాయిలాండ్కు అమెరికా యుద్ధనౌక 'లింకన్'
బ్యాంకాక్: మధ్యప్రాచ్యంలో సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించిన అమెరికా విమాన వాహక యుద్ధనౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' వచ్చే వారం థాయిలాండ్లో లంగరు వేయనుంది. సిబ్బందిలో మానసిక ఒత్తిడి, ఆత్మహత్యాయత్నాలు పెరిగాయన్న కథనాల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
గత నవంబర్లో శాన్ డియాగో నుండి బయలుదేరిన ఈ నౌక, శనివారం మధ్యప్రాచ్యం నుండి బయలుదేరే వరకు వరుసగా 200 రోజులకు పైగా ఏ ఓడరేవులోనూ ఆగలేదు. ఆధునిక నావికాదళ చరిత్రలో ఇది ఒక రికార్డు.
దాదాపు 5,000 మంది నావికులు, మెరైన్లు ఉన్న ఈ నౌక సుదీర్ఘ ప్రయాణం తర్వాత విశ్రాంతి, వినోదం మరియు లాజిస్టికల్ మద్దతు కోసం థాయిలాండ్లో కొద్దిరోజులు ఆగనుంది. ఇది కేవలం సాధారణ పోర్ట్ సందర్శన మాత్రమేనని, ఎలాంటి సైనిక విన్యాసాలు నిర్వహించడం లేదని థాయ్ నౌకాదళం ధృవీకరించింది. భద్రతా కారణాల దృష్ట్యా పర్యటన తేదీలను వెల్లడించలేదు.ఇరాన్తో జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యల్లో భాగంగా ఈ నౌకను మధ్యప్రాచ్యానికి మళ్లించారు.
ఈ నౌకలో మానసిక ఆరోగ్య సమస్యలు, క్షీణిస్తున్న పరిస్థితులపై 'నేవీ టైమ్స్', 'స్టార్స్ అండ్ స్ట్రైప్స్' పత్రికలు కథనాలు ప్రచురించాయి. అయితే, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ వార్తలను ఖండించారు. ఓడలోని పరిస్థితులను ఆ నివేదికలు పూర్తిగా వక్రీకరించాయని ఆయన పేర్కొన్నారు.