BREAKING
హెలికాప్టర్ ఇంజన్ 'అరవల్లి' తయారీకి హెచ్‌ఏఎల్-సాఫ్రాన్ చారిత్రాత్మక ఒప్పందం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ ఇరుముడి సినిమా ప్రదర్శన నిలిపివేత కూతురి వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం నేపాల్‌లో ఆకస్మిక వరదల విధ్వంసం యుఎన్ కమిటీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ ఉల్లి, చక్కెర ధరలు పెరిగితే NAFED నుండి సేకరణ 200 రోజుల తర్వాత థాయిలాండ్‌కు అమెరికా యుద్ధనౌక 'లింకన్' జనగామ జిల్లాలో శిశు మహిళా సమృద్ధి యాప్ ను రద్దు చేయాలని కోరుతూ ప్రజాభవన్ లో వినతి మై భారత్ వాలంటీర్ల నియామకం: దరఖాస్తు గడువు పొడిగింపు.. నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ‘ఇరుముడి’ చూసి ఎమోషనల్ అయిన రష్మిక.. రవితేజ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం తెచ్చిందన్న విజయ్ దేవరకొండ! ఏపీ డిగ్రీ ప్రవేశాలు 2026: ముగింపు దశకు కౌన్సెలింగ్.. ఆగస్టు 27తో వెబ్ ఆప్షన్ల గడువు పూర్తి! స్పిరిట్ కంటే ‘వారణాసి’ చాలా పెద్ద సినిమా.. అవసరమైతే మేమే పక్కకు తప్పుకుంటాం: సందీప్ రెడ్డి వంగా ‘టాక్సిక్’ ట్విట్టర్ రివ్యూ.. యశ్ డబుల్ ధమాకా ఎలా ఉంది? నాలుగేళ్ల వెయిటింగ్‌కు న్యాయం జరిగిందా? అదానీ ఎనర్జీకి ₹4,700 కోట్ల ప్రాజెక్ట్

ఉల్లి, చక్కెర ధరలు పెరిగితే NAFED నుండి సేకరణ

Select Suryaa Now
ఉల్లి, చక్కెర ధరలు పెరిగితే NAFED నుండి సేకరణ

ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం రేఖా గుప్తా
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉల్లిపాయలు, చక్కెర లభ్యత మరియు ధరలపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. ప్రస్తుతం నగరంలో ఎలాంటి కొరత లేనప్పటికీ, ఒకవేళ ధరలు పెరిగితే ప్రజలపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ 'నాఫెడ్' (NAFED) నుండి వీటిని సేకరించి అందుబాటు ధరలకే విక్రయిస్తామని సీఎం స్పష్టం చేశారు.

నాఫెడ్ నుండి సేకరించిన ధరలకే ఉల్లి, చక్కెరలను ప్రజలకు అందిస్తారు. రవాణా మరియు ఇతర నిర్వహణ ఖర్చులను ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుంది. మార్కెట్‌కు సరఫరా సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు, అక్రమ నిల్వలను (బ్లాక్ మార్కెటింగ్) అరికట్టాలని సంబంధిత శాఖను సీఎం ఆదేశించారు. ధరలు పెరిగే సూచనలు ఉంటే, నగరంలోని ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా తక్కువ ధరకే ఉల్లిని పంపిణీ చేయడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం చక్కెర అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆహార, సరఫరా శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా వెల్లడించారు.