గండక్ నదిలో పెరుగుతున్న నీటిమట్టం: బీహార్లో హైఅలర్ట్!
పాట్నా: నేపాల్లోని గండక్ నది ఎగువ పరీవాహక ప్రాంతంలో ఉప్పొంగిన ఆకస్మిక వరదల కారణంగా బీహార్ ప్రభుత్వం తీవ్ర అప్రమత్తత ప్రకటించింది. నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉండటంతో పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
నేపాల్ సరిహద్దుల నుంచి వస్తున్న భారీ వరద నీటితో గండక్ నది పరివాహక జిల్లాల్లో ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక బృందాలను సిద్ధంగా ఉంచడం వంటి అన్ని రక్షణ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎప్పటికప్పుడు నీటిమట్టాలను పర్యవేక్షిస్తూ, జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దించారు.