BREAKING
విజయ్‌ దేవరకొండ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌: సందీప్‌ రెడ్డి వంగాకి ఖరీదైన వాచ్‌ కానుక! గల్ఫ్, ఒమన్ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై క్షిపణి దాడులు 30 రోజుల్లోగా తూర్పు జెరూసలేం కాన్సులేట్‌ను మూసివేయాలని బ్రిటన్‌కు ఇజ్రాయెల్ ఆదేశం డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్‌కు షాక్ ఇచ్చి సెమీస్‌కు దూసుకెళ్లిన బెన్ షెల్టన్ 11 కొత్త నైపుణ్య విభాగాల్లో పోటీపడనున్న భారత్ కోల్‌కతాలో అధునాతన సముద్ర పరిశోధన నౌక ‘సాగర్ మంథన్’ ప్రారంభం గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 ఆశా భోస్లే జన్మదినం సందర్భంగా ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన 'ఆశా ఫరెవర్' గీతం ఆవిష్కరణ సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 3వ జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణ. సీఎం యాదవ్ యూఏఈ పర్యటన విజయవంతం భారత్, శ్రీలంకలు నాగరికత పరంగా కవలలు ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని 'సేవా సంకల్ప అభియాన్' బ్రిక్స్ సదస్సు 2026కు ముందు పోస్టర్లు, దీపాలతో ముస్తాబైన ఢిల్లీ రాష్ట్రపతి, ప్రధానులను కలవనున్న ఆగ ఖాన్ V 2 శాతం పెరిగిన ముడి చమురు ధరలు

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 3వ జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణ.

Select Suryaa Now
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 3వ జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణ.

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 3వ జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణ.

సంగారెడ్డి ..సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 3వ జాతీయ లోక్‌అదాలత్‌ను 12-09-2026న సంగారెడ్డి జిల్లా కోర్టుతో పాటు జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ మరియు జిన్నారం కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించనున్నట్లు  సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి & సెషన్స్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్  జి. భవానీ చంద్ర  తెలిపారు.జాతీయ లోక్‌అదాలత్ ద్వారా వివిధ రకాల సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంకింగ్ మరియు ఇతర రాజీ పడదగిన కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని  న్యాయమూర్తి  పేర్కొన్నారు.12 సెప్టెంబర్ 2026న నిర్వహించనున్న 3వ జాతీయ లోక్‌అదాలత్‌లో అత్యధిక సంఖ్యలో కేసులను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు మరియు సంబంధిత శాఖల అధికారులను కోరారు. పెండింగ్ కేసులతో పాటు ప్రీ-లిటిగేషన్ దశలో ఉన్న వివాదాలను కూడా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రజలు తమ కేసుల పరిష్కారం కోసం సంబంధిత కోర్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ/తాలూకా న్యాయ సేవా కమిటీను సంప్రదించి లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని  జి. భవానీ చంద్ర  పిలుపునిచ్చారు.“రాజీ మార్గమే ఉత్తమ మార్గం – లోక్‌అదాలత్ ద్వారా త్వరితగతిన న్యాయం” అనే లక్ష్యంతో 3వ జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయడానికి అన్ని వర్గాలు సహకరించాలని ఆమె కోరారు.